Thursday, February 26, 2026

ఇజ్రాయెల్ పర్యటన విజయవంతం.. ద్వైపాక్షిక చర్చల్లో కీలక ఒప్పందాలు

ఇజ్రాయెల్ పర్యటన విజయవంతం.. ద్వైపాక్షిక చర్చల్లో కీలక ఒప్పందాలు



 ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ పర్యటన విజయవంతంగా ముగిసింది. గురువారం జెరూసలేంలో ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహుతో ముఖ్యమైన చర్చలు జరిపారు మోదీ. ఈ సమావేశంలో రక్షణ, అంతరిక్ష, సైబర్ భద్రత, జల నిర్వహణ వంటి కీలక రంగాల్లో సహకారాన్ని మరింత విస్తరించేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి. భారత్–ఇజ్రాయెల్ మధ్య పలు ముఖ్య ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. చర్చల అనంతరం రెండు దేశాల ప్రధానులు సంయుక్త ప్రెస్ కాన్ఫరెన్స్‌ను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా వారి సమక్షంలో అనేక కీలక అవగాహన ఒప్పందాలు (MoUs) పరస్పరం మార్పిడి అయ్యాయని తెలిపారు.

కృత్రిమ మేధస్సు, యూపీఐ రంగాల్లో ఒప్పందాలు

మోదీ, నేతన్యాహూ సమక్షంలో భారత్–ఇజ్రాయెల్ మధ్య పలు ముఖ్యమైన అవగాహన ఒప్పందాలు కుదిరాయి. ముఖ్యంగా కృత్రిమ మేధస్సు (Artificial Intelligence) రంగంలో పరస్పర సహకారానికి ఇరు దేశాలు అంగీకరించాయి. అలాగే ఆర్థిక అనుసంధానాన్ని బలోపేతం చేసేందుకు యూపీఐ (UPI) సంబంధిత అవగాహన ఒప్పందం కూడా మార్పిడి అయింది. భారత రాయబారి జేపీ సింగ్ ఇజ్రాయెల్ ప్రతినిధులతో కలిసి ఈ ఒప్పందాల పత్రాలను పంచుకున్నారు. ఈ నిర్ణయాలు ద్వైపాక్షిక సంబంధాలకు కొత్త దిశను చూపనున్నాయని అధికార వర్గాలు పేర్కొన్నాయి.

Monday, February 23, 2026

ట్రంప్‌కు బిగ్ షాక్.. సొంత దేశంలో దారుణంగా పడిపోయిన గ్రాఫ్

ట్రంప్‌కు బిగ్ షాక్.. సొంత దేశంలో దారుణంగా పడిపోయిన గ్రాఫ్

 


అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సొంత దేశంలో తీవ్ర ఎదురుదెబ్బ తగిలింది. అధ్యక్షుడిగా ఆయన రెండో దఫా పదవీకాలంలో ప్రజాదరణ అత్యంత కనిష్ట స్థాయికి పడిపోయింది. తాజాగా వెలువడిన పలు జాతీయ సర్వేలు ఈ సంచలన విషయాలను వెల్లడించాయి. గాలప్, సీఎన్ఎన్, ఏపీ-నార్క్ వంటి ప్రముఖ సంస్థలు నిర్వహించిన తాజా సర్వేల ప్రకారం, ట్రంప్ పాలనను కేవలం 36 నుంచి 39 శాతం మంది మాత్రమే సమర్థిస్తున్నారు. అదే సమయంలో 60 శాతానికి పైగా అమెరికన్లు ఆయన పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం.


దేశ ఆర్థిక వ్యవస్థ నిర్వహణ, ఆకాశాన్నంటుతున్న ధరలు, ద్రవ్యోల్బణం, కఠినమైన ఇమ్మిగ్రేషన్ విధానాలతో పాటు విదేశీ వ్యవహారాల్లో ఆయన తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని ఈ సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. రాబోయే రెండు వేల ఇరవై ఆరు మధ్యంతర ఎన్నికల నేపథ్యంలో ట్రంప్ గ్రాఫ్ ఈ స్థాయిలో పడిపోవడం రిపబ్లికన్ పార్టీ వర్గాల్లో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. రెండో దఫా పాలన మొదలైన అతి కొద్ది కాలంలోనే ఈ స్థాయిలో జనాదరణ కోల్పోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Saturday, February 21, 2026

బ్రెజిల్‌ అధ్యక్షుడితో ప్రధాని మోదీ కీలక భేటీ.. త్వరలో 20 బిలియన్ డాలర్ల వాణిజ్యం !

బ్రెజిల్‌ అధ్యక్షుడితో ప్రధాని మోదీ కీలక భేటీ.. త్వరలో 20 బిలియన్ డాలర్ల వాణిజ్యం !



 భారత్, బ్రెజిల్ దేశాల మధ్య ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యం ఇరు దేశాల ప్రజలకు ఎంతో లాభదాయకంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో శనివారం బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వాతో ( Lula da Silva)  ఆయన ప్రతినిధుల స్థాయి చర్చలు జరిపారు. అనంతరం ఏర్పాటు చేసిన ఉమ్మడి విలేకరుల సమావేశంలో మోదీ మాట్లాడుతూ.. లాటిన్ అమెరికా ప్రాంతంలో భారత్‌కు బ్రెజిలే అత్యంత పెద్ద వాణిజ్య భాగస్వామి అని ఆయన గుర్తుచేశారు. రాబోయే రోజుల్లో ఇరు దేశాల మధ్య వాణిజ్యం 20 బిలియన్ డాలర్ల మార్కును సునాయాసంగా అధిగమిస్తుందన్న బలమైన విశ్వాసాన్ని ప్రధాని వ్యక్తం చేశారు. భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి అధ్యక్షుడు లులా చూపుతున్న అంకితభావానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మన రెండు దేశాల మధ్య పెరుగుతున్న ఈ ఆర్థిక, వాణిజ్య సహకారం కేవలం మనకే కాకుండా గ్లోబల్ సౌత్ అనబడే యావత్ అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రయోజనాలకు, పురోగతికి ఎంతగానో దోహదపడుతుందని మోదీ విశ్లేషించారు. అంతర్జాతీయ వేదికలపై ఇరు దేశాల గొంతుక మరింత బలంగా వినిపిస్తుందని ఆయన ఆకాంక్షించారు.

Friday, February 20, 2026

ప్రేమ పేరుతో వంచన.. డిగ్రీ విద్యార్థిని బలి తీసుకున్న బ్లాక్‌మెయిల్ వీడియో!

ప్రేమ పేరుతో వంచన.. డిగ్రీ విద్యార్థిని బలి తీసుకున్న బ్లాక్‌మెయిల్ వీడియో!

 


గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గ పరిధిలో అత్యంత విషాదకరమైన సంఘటన చోటుచేసుకుంది. ప్రేమ పేరుతో ఒక సీనియర్ విద్యార్థి చేసిన వంచన, ఆపై సాగించిన బ్లాక్‌మెయిల్ ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. సమాజంలో నైతిక విలువల పతనాన్ని, సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న అకృత్యాలను ఈ ఘటన మరోసారి ఎత్తిచూపుతోంది.

పల్నాడు జిల్లాకు చెందిన ఒక మధ్యతరగతి కుటుంబం తమ పిల్లల భవిష్యత్తు కోసం ఊరు వదిలి, తాడేపల్లి సమీపంలోని ఒక గ్రామానికి వలస వచ్చింది. తండ్రి, తల్లి కూలీ పనులు చేస్తూ పిల్లలను చదివిస్తున్నారు. వారి కుమార్తె మంగళగిరిలోని ఒక డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతోంది. తన కాళ్ల మీద తాను నిలబడి, తల్లిదండ్రులకు ఆసరాగా ఉండాలని కలలు కన్న ఆ విద్యార్థిని జీవితంలోకి 'రహీమ్' అనే యువకుడు ప్రవేశించాడు.

Wednesday, February 18, 2026

హైదరాబాద్‌లో ఘోరం.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిని కత్తితో పొడిచి పొడిచి చంపని మాజీ భర్త

హైదరాబాద్‌లో ఘోరం.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిని కత్తితో పొడిచి పొడిచి చంపని మాజీ భర్త



 హైదరాబాద్ నగరంలో నేర ఘటనలు పెరుగుతున్నాయనే ఆందోళనల మధ్య మరో దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇటీవల హత్యలు, ఆత్మహత్యలు, రోడ్డు ప్రమాదాలు వరుసగా చోటుచేసుకుంటుండగా, తాజాగా వనస్థలిపురం పరిధిలో జరిగిన ఘోర హత్య స్థానికులను భయాందోళనకు గురిచేసింది. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

వనస్థలిపురం గ్రీన్ సిటీ కాలనీ అపార్ట్‌మెంట్‌లో 30 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని సునీతను ఆమె మాజీ భర్త మహేష్ దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. సమాచారం ప్రకారం.. నిందితుడు రెండు కత్తులు, ఒక పెట్రోల్ డబ్బా తీసుకుని అపార్ట్‌మెంట్‌లోకి ప్రవేశించాడు. ఇంట్లోకి ఎవరైనా వస్తే పెట్రోల్ పోసి తగలబెడతానని హెచ్చరిస్తూ అక్కడి పరిస్థితిని భయంకరంగా మార్చినట్లు విచారణలో వెల్లడైంది.


మహేష్ సునీతపై కత్తులతో తీవ్రంగా దాడి చేశాడని పోలీసులు పేర్కొన్నారు. దాడి అనంతరం పూల కుండతో ఆమె తలపై కొట్టినట్లు సమాచారం. తీవ్ర గాయాలతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయింది. అపార్ట్‌మెంట్ నివాసితులు ఆందోళనతో బయటకు రావడానికి కూడా భయపడినట్లు తెలుస్తోంది.

Monday, February 16, 2026

కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. సజీవ దహనమైన ఏడుగురు కార్మికులు

కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. సజీవ దహనమైన ఏడుగురు కార్మికులు

 


రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లా భివాడి పారిశ్రామిక ప్రాంతంలో సోమవారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఒక ప్రైవేట్ కెమికల్ ఫ్యాక్టరీలో అకస్మాత్తుగా చెలరేగిన భారీ అగ్నిప్రమాదంలో ఏడుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మంటలు వేగంగా వ్యాపించడంతో మరో 10 మంది కార్మికులు లోపలే చిక్కుకుపోయి ఉండవచ్చని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రసాయనాల కారణంగా మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడటంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగతో నిండిపోయింది.


నిమిషాల్లోనే విస్తరించిన మంటలు..

సోమవారం ఉదయం సుమారు 9.30 గంటల సమయంలో ఫ్యాక్టరీలో పని జరుగుతుండగా ఈ ప్రమాదం సంభవించింది. ఆ సమయంలో యూనిట్‌లో సుమారు 20 నుంచి 25 మంది కార్మికులు విధుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. మంటలు చెలరేగిన వెంటనే ఫ్యాక్టరీలోని రసాయన నిల్వలకు అంటుకోవడంతో ఒక్కసారిగా మంటలు భారీగా ఎగసిపడ్డాయి. ప్రమాద తీవ్రతను గమనించిన కొందరు కార్మికులు ప్రాణాలకు తెగించి బయటకు పరుగులు తీయగా.. మిగిలిన వారు లోపలే ఉండిపోయారు.

రంగంలోకి యంత్రాంగం.. సహాయక చర్యలు ముమ్మరం

పోలీసులు సాధారణ పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో ఫ్యాక్టరీ నుంచి పొగలు రావడాన్ని గమనించి వెంటనే అధికారులను అప్రమత్తం చేశారు. అదనపు జిల్లా మేజిస్ట్రేట్ సుమితా మిశ్రా నేతృత్వంలో పోలీసులు, అగ్నిమాపక దళం, వైద్య బృందాలు యుద్ధప్రాతిపదికన ఘటనా స్థలానికి చేరుకున్నాయి. సుమారు గంటన్నర పాటు శ్రమించి అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. మరోవైపు జిల్లా ఉన్నతాధికారులు సంఘటనా స్థలాన్ని సందర్శించి సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఈ ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలు తెలుసుకోవడానికి, భద్రతా నిబంధనల్లో లోపాలను గుర్తించడానికి జిల్లా యంత్రాంగం మెజిస్ట్రియల్ విచారణకు ఆదేశించింది. తిజారా డీఎస్పీ శివరాజ్ సింగ్ నేతృత్వంలో పోలీసులు సాక్ష్యాధారాలను సేకరిస్తున్నారు.