ఢిల్లీ అల్లర్ల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉమర్ ఖాలిద్, షర్జీల్ ఇమామ్లకు సుప్రీంకోర్టు బెయిల్ నిరాకరించడంతో జేఎన్యూలో నిరసనలు వెల్లువెత్తాయి. ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్ షాలకు వ్యతిరేకంగా జేఎన్యూ విద్యార్థులు చేసిన నినాదాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీశాయి. ముస్లింలపై వివక్షగా కాంగ్రెస్ అభివర్ణించగా.. దేశ వ్యతిరేక శక్తుల అసహనంగా బీజేపీ పేర్కొంది. దీంతో అత్యున్నత న్యాయస్థానం తీర్పుపై రాజకీయ పక్షాల మధ్య మాటల యుద్ధం ముదిరింది.
ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్యూ) మరోసారి వివాదాలకు కేంద్రబిందువుగా మారింది. 2020 ఢిల్లీ అల్లర్ల కేసులో నిందితులుగా ఉన్న ఉమర్ ఖాలిద్, షర్జీల్ ఇమామ్లు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించడంతో జేఎన్యూ క్యాంపస్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాలకు వ్యతిరేకంగా విద్యార్థులు వివాదాస్పద నినాదాలు చేయడం రాజకీయంగా పెను దుమారం రేపుతోంది.
ఈనెల 5వ తేదీ జేఎన్యూ క్యాంపస్లో విద్యార్థుల బృందం నిరసన ప్రదర్శన చేపట్టింది. సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ ప్రధాని మోదీ, అమిత్ షాలను ఉద్దేశించి అనుచిత నినాదాలు చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం తీవ్ర దుమారం రేపుతోంది. ఈ ఘటనపై రాజకీయ వర్గాలు భిన్నంగా స్పందిస్తున్నాయి
