Tuesday, January 6, 2026

మోదీ, షాలపై జేఎన్‌యూలో అనుచిత నినాదాలు.. ఉమర్, ఇమామ్‌లకు బెయిల్ రాకపోవడంతో నిరసనలు

మోదీ, షాలపై జేఎన్‌యూలో అనుచిత నినాదాలు.. ఉమర్, ఇమామ్‌లకు బెయిల్ రాకపోవడంతో నిరసనలు

 


ఢిల్లీ అల్లర్ల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉమర్ ఖాలిద్, షర్జీల్ ఇమామ్‌లకు సుప్రీంకోర్టు బెయిల్ నిరాకరించడంతో జేఎన్‌యూలో నిరసనలు వెల్లువెత్తాయి. ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్ షాలకు వ్యతిరేకంగా జేఎన్‌యూ విద్యార్థులు చేసిన నినాదాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీశాయి. ముస్లింలపై వివక్షగా కాంగ్రెస్ అభివర్ణించగా.. దేశ వ్యతిరేక శక్తుల అసహనంగా బీజేపీ పేర్కొంది. దీంతో అత్యున్నత న్యాయస్థానం తీర్పుపై రాజకీయ పక్షాల మధ్య మాటల యుద్ధం ముదిరింది.


ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) మరోసారి వివాదాలకు కేంద్రబిందువుగా మారింది. 2020 ఢిల్లీ అల్లర్ల కేసులో నిందితులుగా ఉన్న ఉమర్ ఖాలిద్, షర్జీల్ ఇమామ్‌లు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించడంతో జేఎన్‌యూ క్యాంపస్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాలకు వ్యతిరేకంగా విద్యార్థులు వివాదాస్పద నినాదాలు చేయడం రాజకీయంగా పెను దుమారం రేపుతోంది.


ఈనెల 5వ తేదీ జేఎన్‌యూ క్యాంపస్‌లో విద్యార్థుల బృందం నిరసన ప్రదర్శన చేపట్టింది. సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ ప్రధాని మోదీ, అమిత్ షాలను ఉద్దేశించి అనుచిత నినాదాలు చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం తీవ్ర దుమారం రేపుతోంది. ఈ ఘటనపై రాజకీయ వర్గాలు భిన్నంగా స్పందిస్తున్నాయి

Saturday, January 3, 2026

వెనెజులా అధ్యక్షుడు, భార్యను బంధించాం..! ట్రంప్ షాకింగ్ ..!

వెనెజులా అధ్యక్షుడు, భార్యను బంధించాం..! ట్రంప్ షాకింగ్ ..!

 


వెనెజులాను టార్గెట్ చేస్తూ ఇవాళ అమెరికా భారీ వైమానిక దాడులకు దిగడంతో ఒక్కసారిగా ప్రపంచం ఉలిక్కిపడింది. వెనెజులా రాజధాని కారకాస్ పై ఇవాళ అమెికా యుద్ద విమానాలు గర్జించాయి. అలాగే యుద్ధ నౌకలు చుట్టుముట్టాయి. దీంతో వెనెజులా ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరైంది. ఈ దాడుల్లో ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురోతో పాటు ఆయన భార్యను బంధించినట్లు ట్రంప్ సంచలన ప్రకటన చేశారు.


వెనిజులా రాజధాని కారకాస్ లో వరుస పేలుళ్లు జరిగిన కొన్ని గంటల తర్వాత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దీనిపై స్పందించారు. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో, అతని భార్ సిలియా ఫ్లోర్స్ ను అమెరికా దళాలు బంధించాయని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. కారకాస్‌పై పెద్ద ఎత్తున వైమానిక దాడుల తర్వాత ఈ ప్రకటన చేశారు. ట్రంప్ ప్రకటనను వెనెజులా నిర్ధారించలేదు, అలాగని తోసిపుచ్చలేదు. దీంతో ఇది నిజమేనన్న ప్రచారం జరుగుతోంది.


ఇవాళ ట్రంప్ తన ట్రూత్ సోషల్‌లో పెట్టిన పోస్ట్‌లోఅమెరికా "వెనిజులా మరియు దాని నాయకుడిపై పెద్ద ఎత్తున దాడిని విజయవంతంగా నిర్వహించింది" అని అన్నారు, మదురో మరియు అతని భార్య సిలియా ఫ్లోర్స్‌ను అదుపులోకి తీసుకుని, అమెరికా చట్ట అమలు సంస్థలతో కలిసి నిర్వహించిన ఆపరేషన్‌లో దేశం నుండి పంపించి వేశామని వెల్లడించారు. మార్-ఎ-లాగోలో ఉదయం 11 గంటలకు జరగనున్న మీడియా సమావేశంలో మరిన్ని వివరాలను వెల్లడిస్తామని తెలిపారు.


మరోవైపు ఇవాళ వెనెజులాపై అమెరికా వైమానిక దాడుల తర్వాత స్పందించిన అధ్యక్షుడు నికోలస్ మదురో.. ప్రజల్ని, రాజకీయ నాయకుల్ని రోడ్లపైకి రావాలని పిలుపునిచ్చారు. తమ దేశంలో ఖనిజాలు, చమురు కోసమే అమెరికా ఈ దాడులకు పాల్పడుతోందన్నారు. వీటిని దీటుగా ఎదుర్కోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే ట్రంప్ ప్రకటన వెలువడింది. దీంతో అనుమానాలు మరింత పెరిగాయి.