Tuesday, January 6, 2026

మోదీ, షాలపై జేఎన్‌యూలో అనుచిత నినాదాలు.. ఉమర్, ఇమామ్‌లకు బెయిల్ రాకపోవడంతో నిరసనలు

మోదీ, షాలపై జేఎన్‌యూలో అనుచిత నినాదాలు.. ఉమర్, ఇమామ్‌లకు బెయిల్ రాకపోవడంతో నిరసనలు

 


ఢిల్లీ అల్లర్ల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉమర్ ఖాలిద్, షర్జీల్ ఇమామ్‌లకు సుప్రీంకోర్టు బెయిల్ నిరాకరించడంతో జేఎన్‌యూలో నిరసనలు వెల్లువెత్తాయి. ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్ షాలకు వ్యతిరేకంగా జేఎన్‌యూ విద్యార్థులు చేసిన నినాదాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీశాయి. ముస్లింలపై వివక్షగా కాంగ్రెస్ అభివర్ణించగా.. దేశ వ్యతిరేక శక్తుల అసహనంగా బీజేపీ పేర్కొంది. దీంతో అత్యున్నత న్యాయస్థానం తీర్పుపై రాజకీయ పక్షాల మధ్య మాటల యుద్ధం ముదిరింది.


ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) మరోసారి వివాదాలకు కేంద్రబిందువుగా మారింది. 2020 ఢిల్లీ అల్లర్ల కేసులో నిందితులుగా ఉన్న ఉమర్ ఖాలిద్, షర్జీల్ ఇమామ్‌లు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించడంతో జేఎన్‌యూ క్యాంపస్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాలకు వ్యతిరేకంగా విద్యార్థులు వివాదాస్పద నినాదాలు చేయడం రాజకీయంగా పెను దుమారం రేపుతోంది.


ఈనెల 5వ తేదీ జేఎన్‌యూ క్యాంపస్‌లో విద్యార్థుల బృందం నిరసన ప్రదర్శన చేపట్టింది. సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ ప్రధాని మోదీ, అమిత్ షాలను ఉద్దేశించి అనుచిత నినాదాలు చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం తీవ్ర దుమారం రేపుతోంది. ఈ ఘటనపై రాజకీయ వర్గాలు భిన్నంగా స్పందిస్తున్నాయి

Saturday, January 3, 2026

వెనెజులా అధ్యక్షుడు, భార్యను బంధించాం..! ట్రంప్ షాకింగ్ ..!

వెనెజులా అధ్యక్షుడు, భార్యను బంధించాం..! ట్రంప్ షాకింగ్ ..!

 


వెనెజులాను టార్గెట్ చేస్తూ ఇవాళ అమెరికా భారీ వైమానిక దాడులకు దిగడంతో ఒక్కసారిగా ప్రపంచం ఉలిక్కిపడింది. వెనెజులా రాజధాని కారకాస్ పై ఇవాళ అమెికా యుద్ద విమానాలు గర్జించాయి. అలాగే యుద్ధ నౌకలు చుట్టుముట్టాయి. దీంతో వెనెజులా ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరైంది. ఈ దాడుల్లో ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురోతో పాటు ఆయన భార్యను బంధించినట్లు ట్రంప్ సంచలన ప్రకటన చేశారు.


వెనిజులా రాజధాని కారకాస్ లో వరుస పేలుళ్లు జరిగిన కొన్ని గంటల తర్వాత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దీనిపై స్పందించారు. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో, అతని భార్ సిలియా ఫ్లోర్స్ ను అమెరికా దళాలు బంధించాయని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. కారకాస్‌పై పెద్ద ఎత్తున వైమానిక దాడుల తర్వాత ఈ ప్రకటన చేశారు. ట్రంప్ ప్రకటనను వెనెజులా నిర్ధారించలేదు, అలాగని తోసిపుచ్చలేదు. దీంతో ఇది నిజమేనన్న ప్రచారం జరుగుతోంది.


ఇవాళ ట్రంప్ తన ట్రూత్ సోషల్‌లో పెట్టిన పోస్ట్‌లోఅమెరికా "వెనిజులా మరియు దాని నాయకుడిపై పెద్ద ఎత్తున దాడిని విజయవంతంగా నిర్వహించింది" అని అన్నారు, మదురో మరియు అతని భార్య సిలియా ఫ్లోర్స్‌ను అదుపులోకి తీసుకుని, అమెరికా చట్ట అమలు సంస్థలతో కలిసి నిర్వహించిన ఆపరేషన్‌లో దేశం నుండి పంపించి వేశామని వెల్లడించారు. మార్-ఎ-లాగోలో ఉదయం 11 గంటలకు జరగనున్న మీడియా సమావేశంలో మరిన్ని వివరాలను వెల్లడిస్తామని తెలిపారు.


మరోవైపు ఇవాళ వెనెజులాపై అమెరికా వైమానిక దాడుల తర్వాత స్పందించిన అధ్యక్షుడు నికోలస్ మదురో.. ప్రజల్ని, రాజకీయ నాయకుల్ని రోడ్లపైకి రావాలని పిలుపునిచ్చారు. తమ దేశంలో ఖనిజాలు, చమురు కోసమే అమెరికా ఈ దాడులకు పాల్పడుతోందన్నారు. వీటిని దీటుగా ఎదుర్కోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే ట్రంప్ ప్రకటన వెలువడింది. దీంతో అనుమానాలు మరింత పెరిగాయి.

Thursday, December 4, 2025

ఇక అమరావతి ఆంధ్రప్రదేశ్‌కు అఫీషియల్ రాజధాని.. చట్ట సవరణకు చకచకా అడుగులు..

ఇక అమరావతి ఆంధ్రప్రదేశ్‌కు అఫీషియల్ రాజధాని.. చట్ట సవరణకు చకచకా అడుగులు..



 విభజన తర్వాత అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ప్రకటించారు. అయితే ఇంతవరకు చట్టబద్ధత రాలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం చొరవతో.. అమరావతికి అధికారిక గుర్తింపు తెచ్చే ప్రక్రియ వేగవంతమైంది. అందుకోసం ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని సవరించాల్సి ఉంది. ఇప్పటికే సవరణ బిల్లుకు కేంద్ర న్యాయ శాఖ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం కేంద్ర మంత్రివర్గం ఆమోదం కోసం సిద్ధంగా ఉంది. ఆ తర్వాత పార్లమెంటు ఆమోదిస్తే.. అమరావతికి అధికారిక రాజధానిగా చట్టబద్ధత వస్తుంది.



విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక రాజధాని ఉండాలని అమరావతికి శంఖుస్థాపన చేశారు. ప్రపంచ స్థాయి రాజధానిగా చేయాలని.. అమరావతికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. కానీ అధికారికంగా ఆంధ్రప్రదేశ్‌కు అమరావతి రాజధాని అని ఏపీ పునర్వవస్థీకరణ చట్టంలో లేదు. ఈ నేపథ్యంలో అమరావతికి చట్టబద్ధత కల్పించేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ పునర్వవస్థీకరణ చట్టంలో సవరణ చేయడానికి ఇప్పటికే కేంద్రం న్యాయ శాఖ అమోదం తెలిపింది.

Tuesday, December 2, 2025

210 కిలోమీటర్ల ఎక్స్‌ప్రెస్‌వేపై ట్రయల్ రన్ ప్రారంభం.. 4 గంటలు తగ్గనున్న ప్రయాణ సమయం

210 కిలోమీటర్ల ఎక్స్‌ప్రెస్‌వేపై ట్రయల్ రన్ ప్రారంభం.. 4 గంటలు తగ్గనున్న ప్రయాణ సమయం



దేశంలో మరో ప్రతిష్టాత్మకమైన హైవే ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ముస్తాబు అవుతోంది. ఢిల్లీ-డెహ్రాడూన్ మధ్య నిర్మించిన ఈ 210 కిలోమీటర్ల ఎక్స్‌ప్రెస్‌ ప్రారంభం అయితే.. ఈ రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం ఏకంగా 4 గంటలు తగ్గనుంది. ఈ ఎక్స్‌ప్రెస్‌వేలో కొంత సెక్షన్ పనులు పూర్తి కాగా.. ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. ఈ ఢిల్లీ-సహరాన్‌పూర్-డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్‌వేను వీలైనంత త్వరలో ప్రారంభించేందుకు సంబంధిత వర్గాలు ఎదురుచూస్తున్నాయి.


నరేంద్ర మోదీ సర్కార్.. అనేక ప్రాజెక్టులు చేపడుతోంది. ఈ క్రమంలోనే హైవేలు, ఎక్స్‌ప్రెస్ వేలు నిర్మిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు పట్టణాలు, నగరాల మధ్య ఈ హైవేలు అందుబాటులోకి వచ్చాయి. తాజాగా మరో కీలక ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణం పూర్తి చేసుకుని.. ట్రయల్ రన్‌కు సిద్ధమైంది. ఉత్తర భారతదేశంలోనే కీలకమైన హైవే ప్రాజెక్టుల్లో ఒకటైన ఢిల్లీ-సహరాన్‌పూర్-డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్‌వేను త్వరలోనే ప్రారంభించనున్నారు. ఈ ఎక్స్‌ప్రెస్‌వేలో ఒక సెక్షన్ ట్రయల్ రన్ కోసం తెరిచారు. ఈ హై స్పీడ్ కారిడార్ పూర్తిస్థాయి ప్రారంభానికి ఇది ఒక ముఖ్యమైన మైలురాయిగా అభివర్ణిస్తున్నారు.


ఢిల్లీ, డెహ్రాడూన్ మధ్య ప్రయాణ సమయం ప్రస్తుతం 6 గంటల నుంచి ఆరున్నర గంటలు ఉండగా.. ఈ 210 కిలోమీటర్ల పొడవైన ఈ ఢిల్లీ-సహరాన్‌పూర్-డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్‌వే పూర్తి అయితే.. ప్రయాణ సమయం.. కేవలం 2 గంటల నుంచి రెండున్నర గంటలకు తగ్గుతుందని అధికార వర్గాలు తెలిపాయి. ఇది దేశ రాజధాని ఢిల్లీ నుంచి.. పశ్చిమ ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌ల మధ్య కనెక్టివిటీని గణనీయంగా మెరుగుపరుస్తుందని పేర్కొన్నాయి. డిసెంబర్ నెలాఖరు నుంచి జనవరి ప్రారంభం మధ్య 32 కిలోమీటర్ల పూర్తి చేసిన విభాగాన్ని ప్రారంభించడానికి అధికారులు సిద్ధం అవుతున్నారు. 

Wednesday, October 1, 2025

ఆసియా కప్ ట్రోఫీపై మొహ్సిన్ నఖ్వీ ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు; BCCI ప్రతినిధి ACC సమావేశం నుండి వాకౌట్ చేశారు.

ఆసియా కప్ ట్రోఫీపై మొహ్సిన్ నఖ్వీ ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు; BCCI ప్రతినిధి ACC సమావేశం నుండి వాకౌట్ చేశారు.

 


బుధవారం జరిగిన ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) ఆన్‌లైన్ సమావేశం నుంచి BCCI ప్రతినిధి మరియు మాజీ అధికారి ఆశిష్ షెలార్ వాకౌట్ చేశారు. ఆసియా కప్ ట్రోఫీ మరియు పతకాలను భారతదేశం ఎప్పుడు అందుకుంటుందో స్పష్టంగా తెలియకపోవడంతో భారత ప్రతినిధులు ACC అధ్యక్షుడు మరియు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) చీఫ్ మొహ్సిన్ నఖ్వీతో ఈ అంశాన్ని లేవనెత్తారు, కానీ సంతృప్తికరమైన స్పందన రాలేదని తెలిసింది.


"ఈ విషయంపై BCCI కార్యదర్శి దేవ్‌జిత్ సైకియా గతంలో ACCకి లేఖ రాశారని, కానీ ఎటువంటి స్పందన రాలేదని షెలార్ సభ్యులకు తెలియజేశారు. ట్రోఫీ మరియు పతకాలను దుబాయ్‌లోని ACC కార్యాలయానికి అందజేయాలని మరియు భారత బోర్డు వాటిని అక్కడి నుండి స్వీకరించవచ్చని BCCI అభ్యర్థించింది. అయితే, షెలార్‌కు సానుకూల స్పందన రాలేదు. షెలార్ మరియు (మరో ప్రతినిధి) శుక్లా నిరసనగా సమావేశానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు" అని BCCI ఉన్నతాధికారిని ఉటంకిస్తూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదించింది. సమావేశంలో తన ప్రారంభ ప్రసంగంలో భారతదేశం టైటిల్ గెలుచుకున్నందుకు నఖ్వీ అభినందించలేదని ఆయన అన్నారు.

Friday, September 26, 2025

లేహ్ పోలీసులు సోనమ్ వాంగ్‌చుక్‌ను అరెస్టు చేశారు

లేహ్ పోలీసులు సోనమ్ వాంగ్‌చుక్‌ను అరెస్టు చేశారు



ఢిల్లీ: లడఖ్ వివాదం తర్వాత, లేహ్ పోలీసులు సోనమ్ వాంగ్‌చుక్‌ను అరెస్టు చేశారు. పోలీసులు సోనమ్‌ను తెలియని ప్రదేశానికి తరలించారు. లడఖ్ నుండి వచ్చిన బృందంతో హోం మంత్రిత్వ శాఖ ప్రతినిధులు రేపు చర్చలు జరపనున్నారు.


అదే సమయంలో, లడఖ్ వివాదం తర్వాత సోనమ్ వాంగ్‌చుక్ యొక్క NGO యొక్క FCRA లైసెన్స్‌ను కేంద్రం నిన్న రద్దు చేసింది. ఈ చర్యను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తీసుకుంది. సోనమ్ వాంగ్‌చుక్ నేతృత్వంలోని సంస్థ విదేశీ విరాళ నియమాలను ఉల్లంఘించి పెద్ద మొత్తంలో డబ్బును స్వీకరించిందని మరియు గత ఫిబ్రవరిలో పాకిస్తాన్‌ను సందర్శించిందని వచ్చిన ఫిర్యాదుపై CBI దర్యాప్తు ప్రారంభించింది. దర్యాప్తు బృందం సోనమ్ వాంగ్‌చుక్ కార్యాలయాన్ని సందర్శించి పత్రాలను పరిశీలించిందని నివేదికలు తెలిపాయి. దీని తర్వాత కేంద్రం లైసెన్స్‌ను రద్దు చేసింది.


Wednesday, September 24, 2025

లడఖ్‌లో నిరసనలు చెలరేగాయి; నలుగురు మృతి

లడఖ్‌లో నిరసనలు చెలరేగాయి; నలుగురు మృతి


 లడఖ్: రాష్ట్ర హోదా మరియు గిరిజన హోదా కోసం లడఖ్‌లో జరిగిన నిరసనలలో నలుగురు మరణించగా, అనేక మంది గాయపడ్డారు. ఈ ప్రాంతంలో నిషేధాజ్ఞలు విధించబడ్డాయి. ఈ నిరసనకు పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ నాయకత్వం వహిస్తున్నారు.


సెప్టెంబర్ 10 నుండి 35 రోజులుగా సోనమ్ వాంగ్‌చుక్ నేతృత్వంలో నిరాహార దీక్ష చేస్తున్న 15 మందిలో ఇద్దరి ఆరోగ్యం క్షీణించడంతో మంగళవారం సాయంత్రం ఆసుపత్రికి తరలించారు. దీని తరువాత, లేహ్ అపెక్స్ బాడీ (LAB) యువజన విభాగం నిరసన మరియు బంద్‌కు పిలుపునిచ్చింది. నిరసనకారులు బిజెపి కార్యాలయానికి నిప్పు పెట్టారు మరియు CRPF వాహనాలకు నిప్పు పెట్టారు.